శ్రీ విద్వాన్ విశ్వం గారి రచన
"భారతీయ కవితా కల్పకం" (1963) లోని ఆణిముత్యాలు
కొన్ని ఇక్కడ చూడవచ్చు


శ్రుతిదప్పిన వల్లకి

ధూమ సంవృత
వహ్ని శిఖా మతల్లి రమణ,
నలిగిన పీతాంబరంబు
నొకటి గట్టుకొని యున్న
జానకీ కాంత, నంత
కన్గొనియె
నంజనాదేవి కన్నకొడుకు.

****
శారదాభ్ర పరీవృత
చంద్రరేఖ
వాడకము లేక
తంటులు వదిలి పోయి
శ్రుతిని దప్పిన వల్లకి
సొరగి పోయి యున్న
జానకి,
నాంజనేయుండు
చూచె.

- పౌరాణికం - వాల్మీకి