శ్రీ కె.ఎ.అబ్బాస్ 1968లో రచించిన When Night Falls నవలని, శిల్పసౌందర్యం ఏమాత్రం చెక్కుచెదరకుండా తెలుగులోకి అనువదించిన ఘనత శ్రీ దొడ్డవరం కామేశ్వర రావు గారికి దక్కుతుంది. "చీకటి పడ్డాక" అనే పేరుతో 1975 సంవత్సరంలో ప్రచురించినవారు ఎమెస్కో వారు.

ఆ నవలలోని విశేషాలను ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి ప్రతివారం ప్రసారమయ్యే లిటరరీ భోజన హోటల్ - ఉదయతరంగిణి కార్యక్రమంలో వివరించినవారు శ్రీ పైడి తరేశ్ బాబు గారు.

ఎప్పటిలానే చాలా చక్కగా వివరించారు.

ప్రతివారం ఒక వండిన వంటకాన్ని శ్రోతలకు అందించే ఈ ప్రయత్నం అభినందనీయం

ఆడియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ